మారుతున్న కాలానికి తగ్గట్టుగా టీడీపీలో మార్పులు రావాలని మంత్రి లోకేశ్ అన్నారు. పేదరికం లేని సమాజం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. అంతేకాకుండా మహిళలను గౌరవించాలని మంగళగరిలోని కేంద్ర కార్యాలయంలో జరిగిన శిక్షణా తరగతులకు హాజరైన నేతలకు సూచించారు. పార్టీలో కొత్తవారికి అవకాశాలు కల్పించాలని అభిప్రాయపడ్డారు. ఇక కూటమిలో విభేదాలు సాధారణం అని.. వాటిని పరిష్కరించాలని చెప్పారు. వైసీపీ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు శిక్షణ కోసం రీజినల్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని లోకేశ్ తెలిపారు.