కడపలో జరిగిన టీడీపీ మహానాడు సభలో చంద్రబాబు నాయుడు తెలంగాణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలు తన రెండు కళ్లలాంటివని ఆయన అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి, విద్యుత్ సంస్కరణలకు తాను చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. గోదావరి జలాల వినియోగంపై అపోహలు వద్దని, రాయలసీమకు నీళ్లివ్వాలన్నదే తన ఆశయమని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతాయా లేక సత్సంబంధాలకు దారి తీస్తాయా చూడాలి.