Dialysis Centres in Andhra Pradesh: కిడ్నీ రోగులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మారుమూల ప్రాంతాలకు కూడా డయాలసిస్ సేవలు విస్తరించనుంది. రాష్ట్రవ్యాప్తంగా మరో 13 కొత్త డయాలసిస్ కేంద్రాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. గిరిజన ప్రాంతాల్లోనూ ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. దీంతో ప్రభుత్వ పాలనలో మొత్తం 25 డయాలసిస్ కేంద్రాలు సేవలు అందిస్తాయి. వీటి వల్ల సామాన్యులకు.. మారుమూల ప్రాంతాల వారికి ఉచిత డయాలసిస్ అందుబాటులోకి రానున్నాయి.