రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతివనంలో కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ ముఖ్య అతిథిగా అంతర్జాతీయ ఇంటిగ్రేటివ్ హెల్త్ అండ్ వెల్బీయింగ్ సదస్సు (IWH-2025) జరిగింది. యోగ, ధ్యానం వంటి సంప్రదాయ పద్ధతులను ఆధునిక వైద్యంతో కలపడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని మంత్రి తెలిపారు. దేశవ్యాప్తంగా 12,500 ఆయుష్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. హార్ట్ఫుల్నెస్ సంస్థతో కలిసి నిర్వహించిన ఈ సదస్సు సమన్వయ వైద్యానికి ప్రాధాన్యతను పెంచుతుంది.