తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, దివంగత మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి (దామన్న) సేవలకు గౌరవంగా కీలక ప్రకటన చేశారు. నల్గొండ జిల్లాకు గోదావరి నీరు రావడానికి దామన్నే కారణమని తుంగతుర్తిలో జరిగిన సంస్మరణ సభలో సీఎం అన్నారు. ఎస్సారెస్పీ-2 కు ఆర్డీఆర్ (RDR) అని నామకరణం చేస్తూ 24 గంటల్లో జీవో (GO) విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అధిష్ఠానం దామన్న కుటుంబానికి అండగా ఉంటుందని.. రాజకీయంగా అవకాశం కల్పిస్తుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.