కుక్కను తప్పించబోయి.. ముగ్గురు ప్రాణాలు బలి

5 months ago 8
పెద్దలకు పిండప్రదానం చేసేందుకు వెళ్తున్న కుటుంబ సభ్యులను మృత్యువు కబళించిన హృదయ విదారక ఘటన జరిగింది. హైవేపై వేగంగా వెళ్తున్న కారుకి కుక్క అడ్డంగా రావడంతో దాన్ని తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి ఘోర ప్రమాదం జరిగిపోయింది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన దామర్ల లక్ష్మణ్‌, వెంకటసుబ్బాయమ్మ దంపతులు రెండు దశాబ్దాల నుంచి తిరుపతి పోస్టల్‌ కాలనీలో ఉంటున్నారు. పాత రేణిగుంట రోడ్డులో రేడియేటర్‌ రిపేర్ షాప్‌ను నిర్వహిస్తున్నారు. వీరికితోడుగా రెండో కుమారుడు ధనంజయ ఉండగా పెద్ద కుమారుడు గణేష్‌బాబు ఆటోనగర్‌లో మరో షాప్ నడుపుతున్నారు. లక్ష్మణ్‌ కుమార్తె గీత 15 ఏళ్ల కిందట మృతిచెందగా ఆమెతోపాటు ఇతర పెద్దలకు మహాలయ అమావాస్య రోజు పిఠాపురం సమీపంలోని కోటిలింగాల రేవులో పిండ ప్రదానం చేద్దామని శనివారం రాత్రి 10 గంటల 30 నిమిషాలకు బయలుదేరారు. లక్ష్మణ్‌తోపాటు భార్య, పెద్ద కుమారుడు గణేష్‌బాబు, కోడలు పద్మజ, మనవడు హేమంత్‌ కారులో ఉన్నారు. బాపట్ల జిల్లా మార్టూరు సమీపంలోని కోలాలపూడి వద్ద అడ్డుగా వచ్చిన కుక్కను తప్పించే క్రమంలో కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న సిమెంటు దిమ్మెలను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో 70 ఏళ్ల లక్ష్మణ్, 65 ఏళ్ల సుబ్బాయమ్మ, 25 ఏళ్ల హేమంత్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. తీవ్రంగా గాయపడిన గణేష్, పద్మజలను పోలీసులు మార్టూరు సీహెచ్‌సీలో చేర్పించి ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం గుంటూరు తరలించారు.
Read Entire Article