Are Syamala On Devarapalli School Incident: వైఎఎస్సార్సీపీ అధికార ప్రతినిధి ఆరె శ్యామల చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ఇటీవల కాలంలో కుక్కల గురించి మాట్లాడే సెలబ్రిటీలు గిరిజన బిడ్డల గురించి ఎందుకు మాట్లాడరు అంటూ ప్రశ్నించారు. దేవరపల్లి స్కూల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై స్పందిస్తూ ఆమె ట్వీట్ చేశారు. ఈ ఘటనపై ఎక్కడా చర్చ జరగదు.. ఏ మీడియాలోనూ రాదు అంటూ ఆరె శ్యామల ట్వీట్ చేశారు.