కుక్కల రక్తంతో వ్యాపారం అబద్ధం.. ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగిన కుట్ర.. వెంకట్ యాదవ్

1 month ago 14
కుక్కల రక్తంతో వ్యాపారమంటూ వస్తున్న వార్తలపై పెట్స్ కేర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి యాజమాన్యం స్పందించింది. ఆస్పత్రి ఛైర్మన్ వెంకట్ యాదవ్ ఆదివారం విలేకర్ల సమావేశం నిర్వహించి.. ఈ వార్తలను ఖండించారు. తమ ఎదుగుదలను ఓర్వలేక కొంతమంది కావాలనే కుట్రలు చేస్తున్నారని వెంకట్ యాదవ్ ఆరోపించారు. కుక్కల రక్తంతో ఎలాంటి ఉపయోగం లేదన్న వెంకట్ యాదవ్.. వ్యాపారం చేస్తున్నామనే వార్తలు పూర్తిగా అబద్ధమని క్లారిటీ ఇచ్చారు. దీనిపై పరువు నష్టం దావా వేయనున్నట్లు తెలిపారు.
Read Entire Article