ఖమ్మం జిల్లా రైతు పొట్లపల్లి నాగరాజు తన కుమారుడు మణికంఠను క్రికెటర్గా తీర్చిదిద్దాలనే కలతో ఐదెకరాల వ్యవసాయ భూమిని అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన క్రికెట్ మైదానంగా మార్చారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి, కుమారుడి శిక్షణ కోసం ప్రత్యేక పిచ్లు, సౌకర్యాలు కల్పించారు. మణికంఠ రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణిస్తూ.. అండర్-19 తెలంగాణ జట్టుకు ఎంపికయ్యాడు.