తిరుపతి జిల్లాలో దారుణం వెలుగు చూసింది. కన్న కూతురు కళ్ల ముందే అల్లుడిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది ఓ తల్లి. అడ్డుకోబోయిన మైనర్ బాలికపై అల్లుడితో కలిసి విచక్షణారహితంగా దాడి చేసిందా కసాయి తల్లి. బాలిక కేకలు విని.. అక్కడకు వచ్చిన స్థానికులు బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. అనంతరం అత్తా, అల్లుడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ..