Kukatpally Temple Robbery: బంగారం ధరలు పెరగడంతో దొంగతనాలు ఎక్కువయ్యాయి. తాజాగా కూకట్పల్లిలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో భారీ దొంగతనం జరిగింది. సుమారు 40 లక్షల విలువైన ఆభరణాలు, విగ్రహాలను దొంగలు ఎత్తుకెళ్లారు. ఇద్దరు దొంగలు బైక్పై వచ్చి, గర్భాలయంలోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. ఆలయం చుట్టూ భద్రతా ఏర్పాట్లు ఉన్నా దొంగతనం జరగడం స్థానికులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.