కూతురితో గొడవపడి మేనత్త ఇంటికి వెళ్లిన అల్లుడు.. ఆ అత్త మరీ ఇంతకు తెగిస్తుందనుకోలేదు!

6 months ago 13
ఓ అత్త అల్లుడిపై కిరాయి వ్యక్తులతో దాడి చేయించిన ఘటన అన్నమయ్య జిల్లా పెనగలూరులో చోటుచేసుకుంది. రాపూరుకు చెందిన మునుస్వామి నాలుగు రోజుల క్రితం భార్యతో గొడవపడ్డాడు. పెనగలూరులోని మేనత్త ఇంటికి వచ్చాడు. అయితే అల్లుడిపై కోపం పెంచుకున్న అత్త పెంచలమ్మ నలుగురు కిరాయి వ్యక్తులను అల్లుడిపై దాడికి పురమాయించింది. ఈ నేపథ్యంలో సోమవారం రోజున రెండు బైకులపై వచ్చిన దుండుగులు మునుస్వామిపై కత్తితో దాడి చేశారు. అయితే స్థానికులు గమనించి.. కేకలు వేయడంతో పరారయ్యారు. గాయపడిన మునుస్వామిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
Read Entire Article