హైదరాబాద్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూల్ డ్రింక్ అనుకుని యాసిడ్ తాగిన వ్యక్తి మృతి చెందాడు. రహ్మత్నగర్లో నివాసముంటున్న ఒడిశాకు చెందిన సుశాంత్ కుమార్ సాహు అనే వ్యక్తి పొరపాటున యాసిడ్ తాగి ప్రాణాలు కోల్పోయాడు. మరో ఘటనలో.. జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బస్సు ఢీకొని నాగేష్ చారి అనే వ్యక్తి మరణించాడు.