త్వరలో జరగబోయే కేంద్ర మంత్రివర్గ విస్తరణపై తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర క్యాబినెట్లో మరొకరికి అవకాశం కల్పిస్తారా..? లేక ప్రస్తుతం ఉన్న ఇద్దరికే పరిమితం చేస్తారా? అన్న ఉత్కంఠ నెలకొంది. ఈ రేసులో ఈటల రాజేందర్, డి.కె.అరుణ, ధర్మపురి అర్వింద్, జి.నగేశ్ ముందువరసలో ఉండగా..సామాజిక సమీకరణాలు, రాజకీయ సమీకరణాల ఆధారంగా అధిష్ఠానం ఎవరిని ఎంపిక చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది.