Misinformation On Pemmasani Chandra Sekhar : కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై ఆయన కార్యాలయం స్పష్టత ఇచ్చింది. ఆయనకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవని, ట్రక్కింగ్, లాజిస్టిక్స్, రియల్ ఎస్టేట్, మైనింగ్, రవాణా రంగాల్లో ప్రమేయం లేదని తెలిపారు. ప్రజలు ఇలాంటి అబద్ధాలను నమ్మవద్దని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. BSNL పనితీరుపై కూడా సమీక్షించారు.