telangana workers from malaysia jail: మలేషియా జైలులో చిక్కుకున్న తెలంగాణ వాసులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విడిపించారు. ఉపాధి కోసం వెళ్లి.. అక్కడ కేసులో చిక్కుకున్న ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆరుగురిని ఖానాపూర్ బీఆర్ఎస్ నేత జాన్సన్నాయక్ ద్వారా విడిపించి స్వదేశానికి రప్పించారు కేటీఆర్. తమను ఆదుకున్న కేటీఆర్కు బాధితులు, వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వారిని సముదాయించి.. నేనున్నానంటూ భరోసా ఇచ్చారు.