కేరళలో బీజేపీ తరపున తొలిసారి గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు ప్రముఖ మాలీవుడ్ నటుడు సురేష్ గోపి. ఇటీవల కేంద్ర మంత్రి హోదాలో విశాఖపట్నంలో ఆయన పర్యటించారు. బీజేపీ సీనియర్ నేత ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ నటించిన 'అల వైకుంఠపురంలో' సినిమాలోని.. 'సామజవరగమన' పాటను తెలుగులో చక్కగా పాడి అందరినీ అలరించారు సురేష్ గోపి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.