కల్వకుంట్ల కవిత చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. తనపై నిరాధార ఆరోపణలు చేయడం సరికాదని.. తాను కేసీఆర్ కుటుంబాన్ని విడదీయడానికి కాకుండా కలపడానికి ప్రయత్నించానని చెప్పారు. పార్టీ లైన్ దాటినందుకే కవితపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. కవిత చేస్తున్న వ్యాఖ్యల వల్ల కేసీఆర్ ఎంత మనోవేదనకు గురవుతున్నారో ఆమె ఆలోచించాలని సూచించారు. బీఆర్ఎస్తో తన కుటుంబానికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు.