నర్సాపురం నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్కు సీఎం చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. పింఛన్ల పంపిణీ కోసం చంద్రబాబు మంగళవారం రోజు పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరులో పర్యటించారు. పింఛన్లు పంపిణీ చేసిన అనంతరం.. ప్రజా వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పనితీరును ఉద్దేశించి చంద్రబాబు చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.