దివంగత నేత పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. నల్లబెల్లిలో నిర్వహించిన దశదిన కార్యక్రమానికి హాజరైన కేసీఆర్.. పెద్ది చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పెద్ది కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చిన కేసీఆర్.. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ తరఫున పెద్ది కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయానికి సంబంధించిన చెక్కును అందించారు.