తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపుతున్న కవిత లేఖ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ లేఖ బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలను బయటపెడుతోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. కవిత కాంగ్రెస్లో చేరే అవకాశం ఉందని జోస్యం చెప్పారు. ఈ లేఖను రేవంత్ రెడ్డే రాయించారని ఆయన ఆరోపించారు. కల్వకుంట్ల కవిత మరో షర్మిల కాబోతోందని ఆయన అన్నారు. దీనిపై బీఆర్ఎస్ ఇంకా స్పందించాల్సి ఉంది.