కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు కాంగ్రెస్ మంత్రులు.. ప్రత్యేక భేటీ, ఎందుకంటే?

7 months ago 21
తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ మంత్రులు సీతక్క, కొండా సురేఖ గురువారం (జనవరి 8) మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మేడారం సమ్మక్క, సారక్క మహా జాతర ఆహ్వాన పత్రికను అందజేసి.. వనదేవతల పండుగకు రావాలని కోరనున్నట్లు సమాచారం. కాగా, మేడారం జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మహా జాతర జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది.
Read Entire Article