కొండగట్టు ఆంజన్న ఆలయ హుండీ లెక్కింపులో డమ్మీ నోట్ల కట్టలు బయటపడటం పెను కలకలం రేపింది. తాజాగా నిర్వహించిన లెక్కింపులో అసలు కరెన్సీతో పాటు భారీగా డమ్మీ నోట్ల కట్టలను సిబ్బంది గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.2.50 లక్షలు ఉంటుందని తెలుస్తోంది. డమ్మీ నోట్లను వేరు చేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. హుండీలోకి ఆ నకిలీ నోట్లు ఎలా వచ్చాయి.. ఎవరు వేశారు అనే వ్యవహారంపై ఆలయ అధికారులు వివరాలను పరిశీలిస్తున్నారు.