కొండగట్టుకు డిప్యూటీ సీఎం.. ఎమోషనల్ అయిన పవన్ కళ్యాణ్..

2 months ago 8
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శనివారం కొండగట్టు అంజన్నను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఆయనకు అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. గతంలో ఇక్కడే విద్యుత్ ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్నానని.. అందుకే కొండగట్టు తనకు పునర్జన్మ ఇచ్చిందని ఎమోషనల్ అయ్యారు. టీటీడీ కేటాయించిన రూ. 35.19 కోట్ల నిధులతో 96 గదుల ధర్మశాల, దీక్షా విరమణ మండపం నిర్మాణానికి ఆయన భూమిపూజ చేశారు. అనంతరం నాచుపల్లిలో జనసేన కార్యకర్తలతో సమావేశమై, మధ్యాహ్నం హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణమయ్యారు. పవన్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
Read Entire Article