కొండగట్టు అంజన్న భక్తుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జనవరి 3న రూ.35.19 కోట్ల టీటీడీ నిధులతో నిర్మించనున్న 96 గదుల ధర్మశాల, మాల విరమణ మండపానికి భూమి పూజ జరగనుంది. భక్తుల వసతి కష్టాలు తీర్చే ఈ నిర్మాణంతో కొండగట్టు అభివృద్ధిలో కొత్త అధ్యాయం ప్రారంభం కానుంది.