K T Rama Rao: జర్నలిజం ముసుగులో కొన్ని మీడియా సంస్థలు తనపై, తన పార్టీపై విషం చిమ్ముతున్నాయని, వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రచారాలను సహించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ హైదరాబాద్లో ఓ న్యూస్ ఛానెల్ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. ఈ నిరసన ఉద్రిక్తంగా మారింది.