Kodali Nani Family Request For Followers: మాజీ మంత్రి కొడాలి నాని అనారోగ్యం కారణంగా ముంబైలో శస్త్రచికిత్స చేయించుకొని హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన్ను కలవడానికి ఎవరూ రావొద్దని వైఎస్సార్సీపీ నేత విజ్ఞప్తి చేశారు, ఇన్ఫెక్షన్ ప్రమాదం ఉందని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా, ఆయనపై పలు కేసులు ఉండటంతో లుకౌట్ నోటీసులు జారీ చేసింది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఆయన దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందని అనుమానిస్తున్నారు.