కొడుకు, భార్యతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్..

1 year ago 23
ఇటీవల సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలియగానే మెగా ఫ్యామిలీ, వారి అభిమానులు ఎంతో ఆందోళన చెందారు. ఆ రోజు విశాఖ మన్యం పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ ఆ పర్యటన ముగించుకుని నేరుగా సింగపూర్ వెళ్లారు. ఆయన వెంట మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు కూడా అక్కడికి చేరుకున్నారు. ప్రమాదం నుంచి కాస్త కోలుకున్న మార్క్ శంకర్‌ని పవన్ కళ్యాణ్ హైదరాబాద్ తీసుకొచ్చేశారు. భార్య అన్నా లెజినోవా, కొడుకు మార్క్ శంకర్‌తో కలిసి పవన్ శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో పవన్ తన కొడుకుని ఎత్తుకుని వస్తోన్న వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి.
Read Entire Article