తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘సోలార్ మోడల్ విలేజ్’ పథకం ద్వారా సామాన్య కుటుంబాలకు అదనపు ఆదాయం లభించనుంది. ఖమ్మం జిల్లా రావినూతలలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు ద్వారా ఇళ్లపై సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేస్తారు. దీనివల్ల కరెంటు బిల్లులు పూర్తిగా తప్పడమే కాకుండా.. సొంత అవసరాలకు పోను మిగిలిన విద్యుత్తును ప్రభుత్వానికి విక్రయించవచ్చు. దీని ద్వారా ఒక్కో కుటుంబం ఏడాదికి రూ. 5,000 వరకు అదనపు ఆదాయం పొందవచ్చని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. రైతులకు కూడా పంపుసెట్లపై సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసి.. అదనపు విద్యుత్ అమ్మకం ద్వారా లాభం చేకూర్చేలా ఈ పథకాన్ని 81 గ్రామాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.