కొత్త బైక్‌పై రూ.2 వేలు, కారుకు రూ.5 వేలు, భారీ వాహనాలకు రూ.10 వేలు.. అసెంబ్లీలో బిల్లు..

2 months ago 6
తెలంగాణలో కొత్త వాహనాల కొనుగోలుపై ప్రభుత్వం 'రహదారి భద్రతా సెస్సు'ను విధిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రవేశపెట్టిన ఈ నిబంధన ప్రకారం.. ఇకపై బైక్‌పై 2 వేలు, కారుపై 5 వేలు, భారీ వాహనాలపై 10 వేల రూపాయల అదనపు భారం పడనుంది. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ పన్ను వసూలు చేస్తున్నారు. అయితే ఆటోలు, ట్రాక్టర్లకు ఈ పన్ను నుండి మినహాయింపు ఇచ్చారు. అలాగే సరుకు రవాణా వాహనాలపై త్రైమాసిక పన్నును రద్దు చేసి.. 7.5 శాతం జీవితకాల పన్నును అమలు చేయనున్నారు. ఈ సెస్సు ద్వారా ప్రభుత్వానికి ఏటా సుమారు 300 కోట్ల రూపాయల ఆదాయం రానుంది.
Read Entire Article