ఏపీలో మౌలిక వసతుల ప్రాజెక్టుల నిర్మాణం వేగం పుంజుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రంలో జాతీయ రహదారుల నిర్మాణం, విస్తరణతో పాటుగా కొత్త రైల్వే లైన్లు కూడా ఏర్పాటవుతున్నాయి. ఈ క్రమంలోనే అల్లూరి జిల్లాలోని రహదారులకు త్వరలోనే మహర్దశ పట్టనుంది. జిల్లాలోని మూడు మార్గాలని జాతీయ రహదారులుగా మార్చాలంటూ ఏపీ రోడ్లు భవనాల శాఖ అధికారులు కేంద్రానికి ప్రతిపాదించారు. అటు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ కూడా పాడేరుకు జాతీయ రహదారుల అనుసంధానంపై సర్వే చేస్తోంది. ఇవన్నీ కలిసి వస్తే అల్లూరి జిల్లాలో రహదారుల రూపురేఖలు మారిపోతాయని అధికారులు చెప్తున్నారు.