తెలంగాణలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. కొత్తగూడెం, మహబూబ్నగర్లలో విమానాశ్రయాలు సాధ్యం కాదని, నిజామాబాద్లోని జక్రాన్పల్లిలో మాత్రం అవకాశం ఉందని తెలిపింది. కొత్తగూడెం విషయంలో సాంకేతిక, భూ సంబంధిత సమస్యలు అడ్డంకిగా మారాయని చెప్పారు. వరంగల్ విమానాశ్రయ అభివృద్ధి రాష్ట్ర ప్రభుత్వం భూమిని అప్పగించడంపైనే ఆధారపడి ఉంటుందని కేంద్రమంత్రి స్పష్టం చేశారు.