తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల మెరుగుదలకు కేంద్రం ప్రాధాన్యతనిచ్చింది. 42 స్టేషన్ల ఆధునికీకరణ, కొమురవెల్లి మల్లన్న స్టేషన్ పనులు వేగవంతం చేయాలని రైల్వే మంత్రిని కిషన్రెడ్డి కోరారు. యాదాద్రికి ఎంఎంటీఎస్ విస్తరణతో ప్రయాణం సులభతరం అవుతుందని, రోడ్డు ట్రాఫిక్ తగ్గుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.