ఆంధ్రప్రదేశ్లోని ప్రతి ఇంటికి కూడా సురక్షితమైన తాగునీరు అందించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్రంలో జల్ జీవన్ మిషన్లో భాగంగా జరుగుతున్న పనులను వివరిస్తూ ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జల్ జీవన్ మిషన్ కింద రూ.7,910 కోట్లతో పనులు చేపట్టినట్లు వివరించారు. గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం సిబ్బందికి తొలిసారిగా వివిధ అంశాలపై ట్రైనింగ్ కూడా ఇస్తున్నామని వివరించారు.