సంక్రాంతి పండగకు ఏపీలో కోడి ఓ రేంజులో కేకపెట్టింది. పలుచోట్ల జోరుగా కోడిపందేలు జరిగాయి. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లాలో సోమవారం కోటి రూపాయల కోడిపందెం జరిగింది. గన్నవరం మండలం కేసరపల్లిలో జరిగిన ఈ పందెంలో హైదరాబాద్కు చెందిన అమర్ అనే వ్యక్తి కోటి రూపాయలు గెలుచుకున్నాడు. అతని పుంజు విజయం సాధించటంతో.. దాంతో ఫోటోలు దిగేందుకు స్థానికులు ఆసక్తి చూపించారు.