అంబేద్కర్ కోనసీమ జిల్లాలో గ్యాస్ లీక్ ఘటన కలకలం రేపుతోంది. మలికిపురం మండలంలోని ఇరుసమండ వద్ద ఓఎన్జీసీ పైప్లైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. దీంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై అధికారులకు సమాచారం అందించారు. దీంతో ఓఎన్జీసీ సాంకేతిక నిపుణులు అక్కడికి చేరుకున్నారు. గ్యాస్ లీకేజీ ఘటనతో స్థానికులు భయపడిపోతున్నారు. మరోవైపు కోనసీమ జిల్లాలో గతంలోనూ ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి.