కోనో కార్పస్ మొక్కలపై ప్రజల్లో భయాందోళనలు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మొక్కలను కొత్తగా నాటకూడదని, ఉన్న వాటిని నరకవద్దని కేంద్రం ఆదేశించింది. ఆస్తమా వస్తుందనే అపోహలను నమ్మవద్దని, చెట్లు నరికితే చర్యలు తప్పవని జీహెచ్ఎంసీ హెచ్చరిస్తోంది. పర్యావరణానికి మేలు చేసే ఈ మొక్కలపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వీటితో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.