Nellore Rottela Panduga Starts from July 6: నెల్లూరు బారాషహీద్ దర్గా వద్ద రొట్టెల పండుగ సందడి ప్రారంభమైంది. జులై 6 నుంచి ఐదు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగలో హిందూ, ముస్లింలు కలిసి పాల్గొంటారు. స్వర్ణాల చెరువులో రొట్టెలు మార్చుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ప్రభుత్వం ఈ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి, అన్ని ఏర్పాట్లు చేసింది.