ఏపీ ప్రభుత్వం త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం నిధులు విడుదల చేయనుంది. అయితే కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకం అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అధికారులు పలు సూచనలు చేశారు. కౌలు రైతులు అన్నదాత సుఖీభవ పథకం లబ్ధి పొందాలంటే కౌలు గుర్తింపు కార్డు తప్పనిసరి అని.. అలాగే ఈ - పంటలో నమోదు చేసుకొని ఉండాలని సూచిస్తున్నారు. త్వరలోనే అన్నదాత సుఖీభవ పథకం తొలి విడత నిధులు రైతుల అకౌంట్లలో జమ చేయనున్నారు.