రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ క్రమంలోనే ఏపీ నుంచి ఒకరికి పద్మభూషణ్, నలుగురిని పద్మశ్రీ అవార్డులు వరించాయి. ప్రముఖ క్యాన్సర్ వైద్యులు నోరి దత్తాత్రేయుడుకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించారు. అలాగే నటులు రాజేంద్ర ప్రసాద్, మురళీ మోహన్తో పాటుగా తరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, వెంపటి కుటుంబ శాస్త్రికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించారు.