ఖతర్నాక్ ప్లాన్.. రెండు రోజులు ఫామ్ హౌస్ అద్దెకు తీసుకొని.. రూ.55 లక్షలు కాజేసిన కేటుగాళ్లు..

2 months ago 4
హనుమకొండ జిల్లాలో మంత్రతంత్రాల పేరుతో భారీ మోసం జరిగింది. డబ్బును మూడు రెట్లు చేస్తామని నమ్మబలికిన మహారాష్ట్రకు చెందిన నకిలీ పూజారులు.. దేవనపేటకు చెందిన రైతు మట్ల విష్ణు నుంచి రూ. 55.55 లక్షలు కాజేశారు. తన ఫామ్‌హౌస్‌లో పూజ చేయాలని నిందితులు విష్ణును నమ్మించి.. గంట సేపు ఒక గదిలో తలుపులు వేసుకుని ఉండాలని చెప్పారు. ఆ సమయంలో డబ్బుతో నిందితులు పరారయ్యారు. శనివారం బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ధర్మసాగర్ పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు. మూఢనమ్మకాలు నమ్మి మోసపోవద్దని.. డబ్బు రెట్టింపు చేస్తామనే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు.
Read Entire Article