మహబూబ్నగర్ లోక్సభ నియోజకవర్గంలోని మక్తల్లో గుర్తు తెలియని వ్యక్తులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రులను హెచ్చరిస్తూ లేఖలు రాశారు. ఎమ్మెల్యేకు మంత్రి పదవి రాకుండా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ముదిరాజుల పేరుతో లేఖలు రావడంతో ఆ సంఘం నేతలు ఖండించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.