తెలంగాణలో చలి తీవ్రత పెరిగింది. ఉత్తర భారత దేశం నుంచి వీస్తున్న శీతల గాలుల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే దిగువకు పడిపోయాయి. ముఖ్యంగా ఆసిఫాబాద్, సంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాబోయే రెండు రోజులు చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.