తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు కవిత బహిరంగ క్షమాపణలు చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో వారికి పూర్తి న్యాయం చేయలేకపోయానని, కేవలం 500 కుటుంబాలకే ఉద్యోగాలు ఇచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై 'జంగ్ సైరన్' మోగిస్తానని ప్రకటించారు. సామాజిక తెలంగాణ సాధనే లక్ష్యంగా 'జాగృతి జనం బాట' పర్యటన మొదలుపెట్టారు.