పంద్రాగస్టు నాడు కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ ఉద్యోగి అవార్డు అందుకున్న యువకుడు.. 24 గంటలు కూడా గడవకముందే గుండెపోటుతో చనిపోయిన ఘటన గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. జహంగీర్ భాషా అనే యువకుడు 108లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్గా పనిచేసేవారు. ఉత్తమ పనితీరు కనబరిచినందుకు కలెక్టర్ చేతుల మీదుగా శనివారం అవార్డు కూడా అందుకున్నాడు. అయితే అవార్డు అందుకున్న గంటల వ్యవధిలోనే గుండెపోటుతో చనిపోవటం అతని కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది.