భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తొమ్మిది నెలల గర్భిణి లలిత గుండెపోటుతో మరణించింది. అయితే, 'గ్రామ కీడు' అనే మూఢనమ్మకంతో గ్రామస్తులు ఆమె మృతదేహాన్ని ఊర్లోకి రానివ్వలేదు. ఓ రాజకీయ నాయకుడి అండతో కొందరు అడ్డుపడటంతో.. భర్త తన భార్య అంత్యక్రియలను ఊరి పొలిమేరల్లోనే చేయాల్సి వచ్చింది.