మనదేశంలోని ప్రధాన సమస్యలలో లంచం, అవినీతి ప్రధానమైనవి. దేశాభివృద్ధిని అడ్డుకుంటున్న వీటిని నివారించేందుకు, నిర్మూలించేందుకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఏపీ ప్రభుత్వం కూడా లంచం మహమ్మారిని అరికట్టేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి.. సమాచారం అందించాలని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ కోరారు. రాష్ట్రంలో ఏసీబీ ఆఫీసులను పెంచుతామన్నారు.