గాదె సాయికృష్ణ అదృశ్యం వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన సీఐ నాగరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు ఆధారంగా పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు. అటు సాయికృష్ణ కుటుంబం శుక్రవారం సీఎం చంద్రబాబు నాయుడును కలిసింది. న్యాయం చేయాలని వేడుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి అండగా ఉంటామన్న చంద్రబాబు.. దీని వెనుక ఎవరు ఉన్నా కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.