గిరిజన మహిళలకు పవన్ కళ్యాణ్ నూతన సంవత్సర కానుక

7 months ago 25
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గిరిజన మహిళలకు నూతన సంవత్సర కానుక ప్రకటించారు. సికిల్ సెల్ అనీమియా బాధితుల కోసం అరకులో బ్లడ్ బ్యాంకు ఏర్పాటు చేయనున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో.. దాతల సహకారంతో ప్రభుత్వ ఆసుపత్రికి అనుబంధంగా ఈ బ్లడ్ బ్యాంక్ భవనం నిర్మించనున్నారు. అరకు పర్యటనకు వెళ్లిన సమయంలో ఓ గిరిజన మహిళ చెప్పిన కష్టాలను విన్న పవన్ కళ్యాణ్.. సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అందులో భాగంగా వైద్య నిపుణుల సూచనలతో బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
Read Entire Article