స్కూళ్లు, అంగన్వాడీలలో చదువుకునే ప్రతి విద్యార్థికి ఆధార్ కార్డు తప్పనిసరిగా ఉండాలని గుంటూరు జిల్లా కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికి జనన ధ్రువీకరణ పత్రాలు ఉండేలా చూడాలన్న కలెక్టర్.. లేని వారికి వెంటనే దరఖాస్తు చేయించాలని సూచించారు. జనన ధ్రువీకరణ పత్రం వచ్చిన వెంటనే ఆధార్ కార్డు నమోదు కోసం దరఖాస్తు చేయాలని ఆదేశించారు. ఈ మొత్తం ప్రక్రియను నెలరోజుల్లోపు పూర్తి చేయాలని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు.